దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ
హాజరైన ఎమ్మెల్యే- అడిషనల్ కలెక్టర్
బైంసా మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 20
భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్లో ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ దివ్యాంగ లబ్ధిదారులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వలపరంగా అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకోసం సీపీ చైర్లు, వీల్చైర్లు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్లు, టీఎల్ఎం కిట్లు అందజేసిందన్నారు. రూ.47లక్షలు ఖరీదు చేసే ఉపకరణాలను అందజేశామన్నారు. ఇది కేవలం ఉపకరణాల పంపిణీ మాత్రమే కాదని సాధికారత వైపు వేసిన ఒక గొప్ప అడుగని పేర్కొన్నారు. పరికరాలు, చైతన్యం, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయి. గౌరవాన్ని పెంపొందిస్తాయి. లబ్ధిదారుల ముఖాల పై కనిపించిన ఆనందం చూసినప్పుడు ఎంతో ఆనందం కలిగిందనీ ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.