ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
భైంసా: అక్టోబర్ 19
హైదరాబాదులోని ముత్యాలమ్మ టెంపుల్లో విగ్రహం ధ్వంసం చేసిన దుండగులకు కఠినంగా శిక్షించాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు శనివారం భైంసా పట్టణంలో ఆర్డీఓ, ఏఎస్పీ అవినాష్ కుమార్ కు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా, దేవాలయాలను ధ్వంసం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గుజ్జుల్ వార్ వెంకటేష్, పెరుగునవీన్, శివకుమార్ (మారుతి), డి. రాజేందర్, పెండెప్ కాశీనాథ్, యోగేష్ మందని, పోశెట్టి, మల్లేష్, శ్రీకాంత్, గంగాధర్, నరేష్, కళ్యాణ్, గోపి, సంతోష్, రంగు శీను, శక్కెర శ్రీను, గోప్ సూత్రావే, నూకల సురేష్, నంగి దత్తు, కొండా సాయిప్రసాద్, రాజన్న, మరియు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఈ సంఘటనకు సంబంధించి, సభ్యులు తమ ఆందోళనను వ్యక్తం చేసి, ప్రభుత్వానికి సరైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.