అడెల్లి పోచమ్మ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ శిందే ఆనంద్ రావు పటేల్
ఆలయ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకుల సన్మానం
సారంగాపూర్, నవంబర్ 6, 2025 (M4News):
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని శ్రీ మహా అడెల్లి పోచమ్మ అమ్మవారి సన్నిధిలో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శిందే ఆనంద్ రావు పటేల్ గురువారం ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయ డైరెక్టర్లు, సారంగాపూర్ కాంగ్రెస్ నాయకులు బొల్లోజీ నర్సయ్య, బొమ్మేడ సత్యం, వంగ భూమారెడ్డి కలిసి అమ్మవారి ఖండువ కప్పి చైర్మన్ శిందే ఆనంద్ రావు పటేల్ను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది. మహోత్సవాల విజయవంతమైన నిర్వహణకు స్థానిక భక్తులు, కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.