తిరుపతిలో మద్యం నిషేధం – కొన్నిఅంశాలలో మద్యం షాపులకు బంద్

తిరుపతి, అక్టోబర్ 16

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో పలు కీలక ప్రాంతాల్లో మద్యం షాపుల ఏర్పాటుపై నిషేధం విధించింది. భక్తులు తిరుమలకు వెళ్ళే ప్రధాన మార్గాల్లో మద్యం లభ్యత లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, విష్ణు నివాసం, కపిలతీర్థం, అలిపిరి, స్విమ్స్, రుయా ఆసుపత్రి సర్కిల్ వరకూ ఉన్న బైపాస్ రోడ్డులో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం పై నిషేధం విధించింది.

ఈ నిర్ణయం భక్తులకు మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.

Leave a Comment