బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలిగా ఖుష్బూ
ప్రముఖ సినీ నటి ఖుష్బూ సుందర్ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదంతో కొత్త రాష్ట్ర వర్గాన్ని నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 14మంది నియమితులు కాగా ఈ జాబితాలో ఖుష్బూకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా, బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు