చరిత్రాత్మక ఆమరణ దీక్ష: తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో కేసీఆర్‌ పాత్ర

కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష 2009 చరిత్రాత్మక క్షణం
  • 2009 నవంబర్ 29న కేసీఆర్‌ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష.
  • 11 రోజుల దీక్షతో కేంద్రాన్ని ఒప్పించి స్వరాష్ట్ర సాధన.
  • తెలంగాణ ప్రజల సంఘీభావంతో ఉద్యమ విజయతీరాలకు చేరిన ఉద్యమ నాయకుడు.

2009 నవంబర్ 29న కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది. 11 రోజుల పాటు చేపట్టిన దీక్షతో కేంద్రాన్ని ఒప్పించి స్వరాష్ట్ర సాధన ప్రకటనను వెలువడేలా చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు చీకట్లు పొడిచిన ఉద్యమ నాయకుడు, ఉద్యమ సమరయోధుడు కేసీఆర్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.

స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక ఘట్టంగా 2009 నవంబర్ 29న కేసీఆర్‌ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి నూతన అధ్యాయం రాసింది. “కేసీఆర్‌ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో 11 రోజుల పాటు దీక్ష కొనసాగించిన ఆయన ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చారు.

తెలంగాణ ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యలకు స్వరాష్ట్ర సాధనే పరిష్కారమని నమ్మిన కేసీఆర్‌ ఈ ఉద్యమానికి తన జీవితం అంకితం చేశారు. ఆయన దీక్ష సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఉద్యమం ఊపందుకుంది. గాంధేయ మార్గంలో కేసీఆర్‌ చేపట్టిన దీక్షకు ప్రజల విశేష మద్దతు లభించింది. దశాబ్దాలపాటు సాగిన ఉద్యమం చివరికి 2014లో తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించడంతో విజయవంతమైంది.

ఈ దీక్షతో తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసం, ఉద్యమాలపై నమ్మకం పెరిగింది. ఉద్యమ సమరయోధులు చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి. కేసీఆర్‌ నాయకత్వంలో సాధించిన ఈ విజయగాథ రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమవుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment