జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా..?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ వైఫల్యాలను, కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టాలని నాయకులకు సూచించారు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం నలుగురు ఆశావహుల పేర్లను హైకమాండ్కు పంపాలన్నారు. నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రహమత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి