M4News (ప్రతినిధి)
నిజామాబాదు జిల్లా: అక్టోబర్ 11
నిజామాబాద్ జిల్లా జలల్పూర్ గ్రామంలో దసరా దేవిశరన్నవురాత్రులు పురస్కరించుకొని ఘనంగా కోలాటాలను నిర్వహించారు. ఈ సందర్భంగా, వీడీసీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా కోలాట జడకొప్పును చూడడానికి పక్కన ఉన్న గ్రామాల్లోని ప్రజలు తిలకించడానికి వచ్చి ఆనందించారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, పిల్లలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, ఇది గ్రామంలో ఉత్సవాల ఉల్లాసాన్ని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషించింది.