ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతం – నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15

ISRO_GSLV_F15_Launch
  • శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగమైన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్
  • ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో
  • ఇది ఇస్రో శతవృషిక ప్రయోగం, ఇస్రో చైర్మన్ నారాయణన్‌ పర్యవేక్షణలో తొలిప్రయోగం
  • భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఉపయోగపడనున్న ఉపగ్రహం

 

ఇస్రో చరిత్రలో మరో ఘట్టం అందుకుంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది 2,250 కిలోల బరువున్న ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవలకు ఉపయోగపడనుంది. ఇస్రో అధిపతి వి. నారాయణన్ బాధ్యతలు చేపట్టిన తర్వాతి తొలి ప్రయోగం ఇది.

 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రాత్మక ఘనత సాధించింది. శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఇది ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని తీసుకుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ప్రయోగం ఇస్రోకు వందో ప్రయోగంగా నిలిచి చరిత్ర పుటల్లో చేరింది.

ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం:
ఈ ఉపగ్రహం ఇస్రో అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ వ్యవస్థలో భాగంగా రెండో ఉపగ్రహం. దీని బరువు 2,250 కిలోలుగా ఉంది. ఇది భారత నావిగేషన్ వ్యవస్థకు మరింత మెరుగుదల తీసుకురావడంతోపాటు వ్యవసాయం, వైమానిక సేవలు, మొబైల్ పరికరాల్లో లోకేషన్ ఆధారిత సేవలకు కీలకంగా మారనుంది.

ఇస్రో కొత్త చైర్మన్ నారాయణన్‌కు తొలి ప్రయోగం:
ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి. నారాయణన్‌కు ఇది తొలి ప్రయోగం కావడంతో, ఆయనే స్వయంగా అన్ని దశలను పర్యవేక్షించారు. ఈ ప్రయోగం భవిష్యత్తులో మరిన్ని అంతరిక్ష పరిశోధనలకు మార్గదర్శిగా నిలుస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment