ఆమ్రపాలి స్థానాన్ని ఇలంబరతి భర్తీ

Alt Name: తెలంగాణ ఐఏఎస్ బదిలీలు

తేదీ: అక్టోబర్ 17, 2024
ప్రాంతం: హైదరాబాద్

 

  • జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి కాట ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ.
  • రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి కొత్తగా జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియామకం.
  • పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఎన్. శ్రీధర్, విద్యుత్‌ శాఖ ప్రధాన కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా బాధ్యతలు స్వీకరించనున్నారు.
  • ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్‌లను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ.
  • ఖాళీ స్థానాల్లో ఐఏఎస్‌లకు తాత్కాలిక అదనపు బాధ్యతలు అప్పగింపు.

 

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి కాట ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోవడంతో, ఆ స్థానంలో రవాణా శాఖ కమిషనర్‌గా ఉన్న ఇలంబర్తిని నియమించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం సాయంత్రం ఈ ఉత్తర్వులను విడుదల చేశారు.

పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, మహిళా సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా టీకే శ్రీదేవి, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవోగా ఆర్వీ కర్ణన్, మరియు ఆయుష్ డైరెక్టర్‌గా క్రిస్ట్రినాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment