మానవత్వం చాటుకున్న మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు జులై 29 – స్థానిక : ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ నందు గుర్తుతెలియని వ్యక్తి ఎర్రగుంట్ల పరిదిలో రైలు ప్రమాదంలో మృతి చెందగా, మృతదేహాన్ని మార్చరీ నందు ఉంచగా అంతిమ సంస్కరణలు చేయడానికి నాలుగు రోజులు గడిచిన బందువులు ఎవరు లేకపోవడంతో ఎర్రగుంట్ల రైల్వే పోలీసు సిబ్బంది ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సుబహాన్ ను సంప్రదించగా వారు వెంటనే స్పందించి మంగళవారం హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు సుమన్ బాబు, సురేష్, ప్రసన్న కుమార్,పవన్ సాయి మరియు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు… మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్ధులకు సహాయం చేయదలచిన *ఎవరైనా దాతలు ఉంటే ఈ నెంబర్లను సంప్రదించ వలసిందిగా కోరుచున్నాము..
82972 53484,
9182244150.