యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో హృదయ విదారక దృశ్యాలు
యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలంలో మనసును కలిచివేసే ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆకలితో ఏడుస్తున్న తన చంటి బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలు ఇస్తూనే యూరియా కోసం క్యూలైన్లో వేచి ఉన్న తల్లి హృదయాలను మెలిపెడుతోంది.
అలాగే మరో తల్లి తన ముగ్గురు చిన్నారులతో కలిసి అదే క్యూలైన్లో నిలబడి ఉండటం అక్కడి పరిస్థితుల తీవ్రతను ప్రతిబింబిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఎరువుల కొరత కారణంగా రైతులు, వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు ఈ దృశ్యాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.