షాపుల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి: నిర్మలా సీతారామన్
షాపుల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి: నిర్మలా సీతారామన్
దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు వివరాలకు సంబంధించిన బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ‘జీఎస్టీ తగ్గింపుతో 140 కోట్ల మందికి ఉపశమనం లభించనుంది. ఈ నెల 22 నుంచి పన్ను తగ్గింపు అమలులోకి వస్తుంది. 350కి పైగా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అది సరిగ్గా అమలయ్యేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి’ అని వివరించారు