భూగర్భ జలాల సంరక్షణ: నారీ శక్తి కార్యక్రమం నిర్దేశాలు

నారీ శక్తిసే జల్ శక్తి కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ అనిత
  • భూగర్భ జలాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: డిప్యూటీ డైరెక్టర్ అనిత
  • “నారీ శక్తిసే జల్ శక్తి” కార్యక్రమంలో నీటి సంరక్షణ పరిశీలన
  • ఇక్కడి ఇంకుడు గుంతల నిర్మాణం రాష్ట్ర స్థాయిలో మెరుగ్గా కొనసాగుతున్నదని ప్రశంస

 

 నారీ శక్తిసే జల్ శక్తి కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ అనిత


నిర్మల్ జిల్లాలో “నారీ శక్తిసే జల్ శక్తి” కార్యక్రమంలో భాగంగా, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిత పర్యటించారు. లక్ష్మణచందా మండలంలో నీటి సంరక్షణ చర్యలు, మొక్కల పెంపకం పరిశీలించారు. జిల్లాలో ఇంకుడు గుంతల నిర్మాణం మెరుగ్గా సాగుతోందని ప్రశంసించారు. హస్తకళలను భవిష్యత్ తరాలకు అందించే ప్రాధాన్యతను గుర్తుచేశారు.

నవంబర్ 15, 2024, నిర్మల్:

భూగర్భ జలాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిత పేర్కొన్నారు. “నారీ శక్తిసే జల్ శక్తి” కార్యక్రమంలో భాగంగా గురు, శుక్రవారాలు (నిన్న, ఈ రోజు) జిల్లాలో పర్యటించారు.

నిన్న సోన్ మండలంలోని వివిధ గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలను పరిశీలించిన అనిత, ఈ రోజు లక్ష్మణచందా మండలం చామన్ పల్లి, పొట్టపల్లి గ్రామాలను సందర్శించారు. మొక్కల పెంపకం, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నీటి సంరక్షణ చర్యలను స్వయంగా పరిశీలించి, ఇక్కడి ఇంకుడు గుంతల నిర్మాణం రాష్ట్ర స్థాయిలో మెరుగ్గా కొనసాగుతోందని ప్రశంసించారు.

అనంతరం, జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సందర్శించి, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లాలోని ప్రత్యేకమైన కొయ్య బొమ్మల తయారీ కేంద్రాన్ని సందర్శించి, హస్తకళలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు, మహిళా సంఘాల సభ్యులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment