- జియో రూ.69, రూ.139 ప్లాన్ల వ్యాలిడిటీ తగ్గింపు
- యూజర్ బేస్ ప్లాన్ల వెసులుబాటు తొలగింపు
- ఇప్పుడు ఈ ప్లాన్ల వ్యాలిడిటీ కేవలం 7 రోజులు మాత్రమే
జియో తన రూ.69, రూ.139 డేటా ప్లాన్ల వ్యాలిడిటీని కేవలం 7 రోజులకు పరిమితం చేసింది. యూజర్ బేస్ ప్లాన్లతో పనిచేసే వీలును తొలగించి, ఈ కొత్త మార్పులు తీసుకొచ్చింది. గతంలో యూజర్ బేస్ ప్లాన్ల గడువు మేరకు ఇవి కొనసాగుతుండగా, ఇప్పుడు రీఛార్జి చేసిన 7 రోజులకే ప్లాన్ ముగుస్తుంది.
జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు కీలక మార్పు తీసుకొచ్చింది. ఇప్పటివరకు యూజర్ బేస్ ప్లాన్లతో అనుసంధానంగా పనిచేసే రూ.69, రూ.139 డేటా ప్లాన్లను ఇప్పుడు కేవలం 7 రోజుల వరకు మాత్రమే పరిమితం చేసింది. అంటే, వీటిని రీఛార్జి చేసినప్పటికీ అవి యూజర్ బేస్ ప్లాన్ గడువుకు అనుగుణంగా కొనసాగకుండా, నిర్ధిష్టంగా 7 రోజులపాటు మాత్రమే పనిచేస్తాయి.
గతంలో, ఒక వినియోగదారు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రధాన ప్లాన్కు అదనంగా డేటా పొందేందుకు ఈ ప్లాన్లను రీఛార్జి చేసుకునేవారు. అయితే, ఈ కొత్త మార్పులతో, మరింత తక్కువ సమయానికి ఈ డేటా ప్లాన్స్ అందుబాటులో ఉండబోతున్నాయి. జియో తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు కొన్ని అసౌకర్యాలు కలిగించే అవకాశం ఉంది.