- పెద్దపల్లి జిల్లా మంథని మండలం బోయిన్ పేటలో గీత కార్మికుడు తాటి చెట్టు పై నుండి పడి గాయాలు
- గీత కార్మికుడు శంకర్కు వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచన
- ప్రభుత్వ సహాయం కోరుతున్న కుటుంబ సభ్యులు, గౌడ సంఘం నాయకులు
: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బోయిన్ పేట గ్రామంలో తాటి చెట్టు పై నుండి ప్రమాదవశాత్తు పడిన గీత కార్మికుడు తాటి శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందించాలని గౌడ సంఘం నాయకులు కోరుతున్నారు.
: పెద్దపల్లి జిల్లా మంథని మండలం బోయిన్ పేట గ్రామంలో ఆదివారం ఉదయం తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు పడిన గీత కార్మికుడు తాటి శంకర్ తీవ్ర గాయాలు పొందారు. గౌడ వృత్తిలో కొనసాగుతున్న శంకర్ తాటి చెట్టు ఎక్కుతుండగా జారి పడడంతో గాయాలపాలయ్యారు. గ్రామస్థులు అతన్ని చికిత్స కోసం మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతనికి ఆపరేషన్ అవసరమని నిర్ధారించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన శంకర్కు ఆర్థిక సహాయం అందించాలని, మంథని గౌడ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ ఘటన గ్రామస్తులలో విషాదాన్ని నింపగా, శంకర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.