గణేష్ శోభాయాత్ర కు విసృతమైన భద్రతా ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్న జిల్లా పోలీసు శాఖ

గణేష్ శోభాయాత్ర కు విసృతమైన భద్రతా ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్న జిల్లా పోలీసు శాఖ

గణేష్ శోభాయాత్ర కు విసృతమైన భద్రతా ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్న జిల్లా పోలీసు శాఖ

నిమజ్జన శోభాయాత్ర వెళ్ళే మార్గాన్ని, బంగల్ పేట్ వద్ద ఉన్న నిమజ్జన ఘాట్ ను స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ

180 సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం – నిమజ్జన యాత్రపై కట్టుదిట్టమైన నిఘా

నిర్మల్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర కోసం 508 మంది పోలీసులతో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ధార్మిక స్థలాల వద్ద పటిష్ట నిఘా – భద్రతా చర్యల్లో నిర్మల్ పోలీసుల అప్రమత్తం

నిమజ్జన శోభాయాత్ర మార్గంపై డేగ కన్ను – ప్రతి అడుగులోనూ పోలీసులు నిఘా

డీజేలు పరిమితికి లోబడి వినియోగించాలి – ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

నిమజ్జన శోభాయాత్రలో శాంతి భద్రతలకే ప్రాధాన్యం – జిల్లా ఎస్పీ డా జి.జానకి షర్మిల ఐపీఎస్ ఆదేశాలు

మనోరంజని ప్రతినిధి నిర్మల్ సెప్టెంబర్ 05

గణేష్ శోభాయాత్ర కు విసృతమైన భద్రతా ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్న జిల్లా పోలీసు శాఖ

నిర్మల్ పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంట్లో భాగంగా జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ నిమజ్జన ఏర్పాట్లను ఏఎస్పీ రాజేష్ మీన ఐపీఎస్, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్ ఐ రామ్ నిరంజన్ రావ్ (అడ్మిన్) లతో కలిసి పర్యవేక్షించారు.అలాగే నిమజ్జన ఘాట్ల వద్ద ఉన్న స్విమ్మర్లతో, క్రేన్ ఆపరేటర్లతో మాట్లాడారు. ఒక విగ్రహనికి పూజలు చేసి నిమజ్జనాన్ని స్వయంగా పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద,నిమజ్జన ఘాట్‌ల వద్ద 180 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని నేరుగా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయడం జరిగింది.ప్రతి కదలికపై డేగ కన్ను వేసి పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. మొత్తం 508 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేయగా, ఇందులో జిల్లా ఎస్పీ తో పాటు, ఒక అడిషనల్ ఎస్పీ, ఇద్దరు ఏ ఎస్పీ లు,11 మంది ఇన్స్పెక్టర్లు,31 మంది ఎస్ఐ లు,106 మంది ఏ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్,323 మంది కానిస్టేబుల్స్,31 మంది మహిళా పోలీసులు ఉన్నారు.రూట్‌మ్యాప్ ప్రకారం ప్రతి మలుపు వద్ద అదనపు సిబ్బందిని నియమించారు.శోభాయాత్ర మార్గంలో ధార్మిక స్థలాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. డీజే సౌండ్ వ్యవహారంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు నియమ నిబంధనల ప్రకారమే వినియోగించుకోవాలని హెచ్చరించారు. ఆదేశాలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిమజ్జన శోభాయాత్రలో ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు. ప్రజలు పోలీసులు ఇచ్చిన సూచనలను పాటించి, శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలియజేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment