దుర్గామాత సేవలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
మనోరంజని ప్రతినిధి, భైంసా – సెప్టెంబర్ 27
భైంసా మండలంలోని దేగాం గ్రామంలో శరన్నవరాత్రి వేడుకల భాగంగా శుక్రవారం నిర్వహించిన దుర్గామాత పూజలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి పాల్గొన్నారు. త్రినేత్ర యూత్ సభ్యులు, గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఆయన గ్రామానికి చేరుకుని ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, త్రినేత్ర యూత్ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతించి, పూలమాలలు, శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భి. శ్రీను, వీడీసీ అధ్యక్షుడు లింగన్న, గాడోళ్ల నరేష్, భోజన్న, జయందర్, గణేష్, మహేష్, సంతోష్, శ్రీకాంత్, అచ్యుత్, సతీష్, నవీన్, సోను తదితరులు పాల్గొన్నారు.