బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
మనోరంజని ప్రతినిధి
ముధోల్ : ఫిబ్రవరి 05
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్- మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ మాజీ ఉపసర్పంచ్ నరేందర్ భార్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. మాజీ సర్పంచ్ ను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల గంగారెడ్డి, నాయకులు కిషన్ పటేల్, గోపిడి ప్రేమ్ నాథ్ రెడ్డి, పతంగె కిషన్, దిగంబర్, అజిజ్, షకీల్, వాహజ్ బాయ్, సోషల్ మీడియా కన్వీనర్ నజీమ్ హైమద్, తదితరులు పాల్గొన్నారు