నేడు నాంపల్లి కోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్

KTR_Nampally_Court_Hearing

హైదరాబాద్: అక్టోబర్ 18

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు.

ఈ కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని న్యాయ స్థానం నమోదు చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో 23 రకాల ఆధారాలను కోర్టుకు సమర్పించారు కేటీఆర్ తరపు లాయర్. బీఎన్ఎస్ 356 కింద కొండా సురేఖపై పరువు నష్టం చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ కోరారు.

కాగా, కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున కూడా పరువు నష్టం దావా వేయగా, ఆమె స్పందించలేదు. మొత్తం గా, మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో రెండు పరువు నష్టం కేసులు ఉన్నాయి.

అయితే, కోర్టు నోటీసులకు మంత్రి కొండా సురేఖ ఇచ్చే సమాధానాన్ని బట్టి న్యాయస్థానం చర్యలు ఉండనున్నాయి.

18కి వాయిదా వేసిన కేసు ఈరోజు కేటీఆర్ తో సహా నలుగురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని తెలిపింది ధర్మాసనం.

Join WhatsApp

Join Now

Leave a Comment