నిర్మల్, జులై 06
నిర్మల్ జిల్లాలోని పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న దివ్యాంగుల వివరాలను ఈనెల 15వ తేదీలోపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) దర్శనం భోజన్న ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న దివ్యాంగుల వివరాలను ఈనెల 15 లోపు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) దర్శనం భోజన్న ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన ప్రొఫార్మాను పూర్తిచేసి, దివ్యాంగుల ఒరిజినల్ మెడికల్ సర్టిఫికెట్తో పాటు ధ్రువీకరించబడిన జిరాక్స్ కాపీని సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పంపాలని సూచించారు.
ఈ పరీక్షలలో దివ్యాంగులకు కొన్ని పేపర్ల మినహాయింపు, ఇతర రాయితీ సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. మరిన్ని విషయాలకు జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్ ను సంప్రదించాలని సూచించారు.












