-
- రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా విజయం
- కౌడగాని వెంకటేష్, సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు
- యూత్ కాంగ్రెస్ పాత్రను కొనియాడిన సిఎం
-
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా 9,314 ఓట్లతో విజయం సాధించిన డా. కౌడగాని వెంకటేష్, మొదటి సారి సిఎం రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సిఎం రేవంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ భవిష్యత్తు పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
-
తెలంగాణ యువజన కాంగ్రెస్ ఎన్నికలలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా 9,314 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన డా. కౌడగాని వెంకటేష్, సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా, సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో అధికారాన్ని సాధించడంలో యూత్ కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని అభినందించారు. అలాగే, భవిష్యత్తులో యువ నేతల కోసం మంచి అవకాశాలు కల్పించే దిశగా అవసరమైన కార్యాచరణ చేపడతామని ప్రకటించారు.
: రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మొదటి సారి సిఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన డా. కౌడగాని వెంకటేష్
Published On: December 9, 2024 9:41 am