ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
నిర్మల్ జిల్లా,: అక్టోబర్ 21
సారంగాపూర్: మండలంలోని రామ్ సింగ్ తండాలో గురువారం పిడుగుపడి 70 గొర్రెలు మృతిచెందాయి విషయం తెలుసుకున్న చుట్టుపక్క గ్రామలకు చెందిన గొఱ్ఱెల పెంపకం దారులు సోమవారం 40 గొర్రెలను బాధిత రైతు చౌహాన్ వినేశ్ కు విరాళంగా అందజేసి మానవత్వం చాటు కున్నారు.ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ..పిడుగు పడి నష్టం వాటిల్లిన రైతుకు గొర్రెలు విరాళంగా అందించిన వారికి పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.
మరింతమంది దాతలు ముందుకువచ్చి బాధిత రైతును ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తండా వాసులు వివిధ గ్రామాలకు చెందిన దాతలు పాల్గొన్నారు