కడ్తాల్ వై జంక్షన్ రహదారి సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ హామీ

Kadthal Y Junction Road Issue Meeting with Collector
  • కడ్తాల్ వై జంక్షన్ వద్ద రహదారి మార్గదృష్టి సమస్య
  • సోన్ మండల ప్రజలతో కలెక్టర్ అభిలాష అభినవ్ భేటీ
  • జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో పరిష్కారం హామీ
  • ప్రమాదకర మార్గం వల్ల ప్రజలకు ఇబ్బందులు, ప్రాణాపాయ పరిస్థితులు

నిర్మల్ జిల్లా కడ్తాల్ వై జంక్షన్ వద్ద రహదారి మార్గం సమస్యను పరిష్కరించాలని సోన్ మండల ప్రజలు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను బుధవారం  కలిశారు. నిర్మల్ వెళ్లే రహదారి పాత వై జంక్షన్ ద్వారానే కొనసాగాలని వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.

నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ వై జంక్షన్ వద్ద రహదారి మార్పు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోన్ మండల కేంద్రం, పాక్ పట్ల, గంజాల్, మాదాపూర్, నిర్మల్ పట్టణ ప్రజా ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను కలిసి పాత వై జంక్షన్ ద్వారానే రహదారి కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం నిర్మల్ పట్టణానికి వెళ్లే రహదారిని కొండాపూర్ మీదుగా మళ్లించడంతో ప్రజలకు ప్రయాణ దూరం పెరగడంతో పాటు, అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు చేరుకునే సమస్యలు ఎదురవుతున్నాయి. 48 రోజులుగా దీక్ష చేస్తున్న కడ్తాల్ గ్రామస్తులు ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో నిర్మల్ పట్టణ మాజీ కౌన్సిలర్ రఫీ అహ్మద్ ఖురేష్, గంజాల్ మాజీ సర్పంచ్ లావణ్య నవీన్, మాజీ ఉప సర్పంచ్ గంగయ్య, సోన్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు లింగవ్వ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment