ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

: జిల్లా కలెక్టర్ ప్రజావాణి సమావేశంలో ప్రజలతో మాట్లాడుతున్న దృశ్యం.

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

: జిల్లా కలెక్టర్ ప్రజావాణి సమావేశంలో ప్రజలతో మాట్లాడుతున్న దృశ్యం.


నిర్మల్, అక్టోబర్ 28, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

అదే సమయంలో, ఒకే సమస్యపై ప్రజలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదని తెలియజేశారు. ఇప్పటివరకు శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపరుచాలని, దరఖాస్తుదారులకు పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందించాలన్నారు.

ఈ ప్రజావాణి సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు ఇతరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment