ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థినికి అభినందనలు – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

  • వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తి జాతీయస్థాయిలో మూడవ స్థానం.
  • ‘ఇండియా ఈస్ ఆస్’ సంస్థ నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజయ సాధన.
  • కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేత.

 

నిర్మల్: వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని చిన్నోళ్ల ప్రశస్తి ‘ఇండియా ఈస్ ఆస్’ నిర్వహించిన జాతీయ స్థాయి వ్యాసరచన పోటీల్లో మూడవ స్థానంలో నిలిచింది. జిల్లాకలెక్టర్ అభిలాష అభినవ్ ఆమెను అభినందిస్తూ, ప్రశంసా పత్రాన్ని అందించారు. విద్యార్థిని విజయం పై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.

 

నిర్మల్: వేదం గ్లోబల్ స్కూల్ కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని చిన్నోళ్ల ప్రశస్తి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటింది. ‘ఇండియా ఈస్ ఆస్’ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన భారతదేశపు ప్రీమియర్ క్రియేటివిటీ నేషనల్ అండ్ ఇంటర్ స్కూల్ పెయింటింగ్, రైటింగ్ పోటీల్లో భాగంగా పవిత్ర స్వేచ్ఛ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది.

ఈ విజయం సాధించిన ప్రశస్తిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్‌లో అభినందించారు. కలెక్టర్ ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందజేస్తూ, “ఇది గర్వించదగ్గ విషయం” అని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధించాలని ఆయన ఆశించారని పేర్కొన్నారు. విద్యార్థిని విజయం సాధించడంలో ఆమెను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులను కూడా కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భూపాల్ రెడ్డి, ప్రవళిక రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.

Leave a Comment