ఆర్థిక అక్షరాస్యతో అభివృద్ధి

Financial Literacy Awareness Program in Vajjara Village
  • తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆర్థిక అవగాహన సదస్సు
  • బీమా పథకాల గురించి వివరించిన బ్యాంకు మేనేజర్
  • గ్రామీణ ప్రజలలో ఆర్థిక అక్షరాస్యత పెంపు

 

తెలంగాణ గ్రామీణ బ్యాంకు, నాబార్డ్ సహకారంతో, బోథ్ మండలంలోని వజ్జర గ్రామంలో ఆర్థిక అవగాహన సదస్సు నిర్వహించింది. బ్యాంకు మేనేజర్, ప్రభుత్వ బీమా పథకాల గురించి వివరించారు. 18-70 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తులు చందా ఇచ్చి, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించుకోవచ్చని తెలిపారు. కృషి, పొదుపు, రుణాలు, ఇన్సూరెన్స్ పథకాలను గుర్తు చేశారు.

 

ఆదిలాబాద్ జిల్లా: అక్టోబర్ 22

బోథ్ మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ తెలిపారు. నాబార్డ్ వారి ఆర్థిక సహకారంతో, తెలంగాణ గ్రామీణ బ్యాంకు సోనాల బ్రాంచ్ ఆధ్వర్యంలో మంగళవారం వజ్జర గ్రామంలో ఆర్థిక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జీవిత బీమా పథకాల గురించి వివరించారు. ముఖ్యంగా, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన ద్వారా 18 నుండి 50 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఏటా రూ. 436 చెల్లించి చేరితే, అకాల మరణం లేదా సహజ మరణం చెందితే, బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల బీమా అందుతుందని చెప్పారు.

అలాగే, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో 18 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులు ఏటా రూ. 20 చెల్లించి చేరితే, ప్రమాదవశాత్తు మరణం జరిగితే కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం అందుతుందని వివరించారు.

ఇతర అంశాల గురించి మాట్లాడుతూ, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ. 1,000 చెల్లిస్తే రూ. 20 లక్షల ప్రమాద బీమా అందించవచ్చని, వ్యవసాయ రుణాలను ఏడాదిలోపు పునఃనవీకరించుకుంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ రాయితీ లభిస్తుందని తెలిపారు.

కళాజాత బృందం సభ్యులు బ్యాంకులో పొదుపులు, డిపాజిట్లు, రుణాలు, ఇన్సూరెన్స్ పథకాలు, ఏటీఎం కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, ఓటీపీ నంబర్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ నరేందర్, గ్రామ పటేల్, విరోఎ మాణిక్ రావు, కళాజాత బృందం సభ్యులు, మహిళా సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment