తిరుగులేని దబంగ్ ఢిల్లీ
ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో వరుసగా ఐదు ఓటముల తర్వాత గుజరాత్ జెయింట్స్ మంగళవారం యూపీ యోధాస్ను 33–27 పాయింట్ల తేడాతో ఓడించి తొలి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతోనూ జెయింట్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగునే ఉంది. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 38–37 పాయింట్ల తేడాతో హరియాణా స్టీలర్స్ను ఓడించి అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. నేడు తెలుగు టైటాన్స్ పట్నా పైరేట్స్తో, పుణేరీ పల్టన్ బెంగాల్ వారియర్స్తో తలపడతాయి.