హైదరాబాద్, 2026-08-10
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ ఘటనలో మృతి చెందిన అలంపూర్ నియోజకవర్గానికి చెందిన మెడికో డాక్టర్ ప్రియాంక మృతదేహాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ ఘటనలో మృతి చెందిన అలంపూర్ నియోజకవర్గానికి చెందిన మెడికో డాక్టర్ ప్రియాంక మృతదేహాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్కు తరలించారు. మరికాసేపట్లో హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కుటుంబానికి అండగా సంపత్ కుమార్
డాక్టర్ ప్రియాంక కుటుంబ సభ్యులకు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ అండగా నిలిచారు. ప్రియాంక తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు ఫోన్లో అందుబాటులో ఉంటూ వారి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో మాట్లాడి పోస్టుమార్టానికి అవసరమైన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
స్వగ్రామానికి తరలింపు ఏర్పాట్లు
పోస్టుమార్టం అనంతరం డాక్టర్ ప్రియాంక మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం ప్రియాంక కుటుంబ సభ్యులతో కలిసి మృతదేహాన్ని తరలించే అంబులెన్స్ వెంట గాంధీ ఆసుపత్రి నుంచి ఐజ మండలం ఎక్లాస్పురం వైపు ఆయన బయలుదేరనున్నారు.
ప్రభుత్వ సహాయ సహకారాలు
విషాదకర ఘటనతో తీవ్ర విషాదంలో ఉన్న డాక్టర్ ప్రియాంక కుటుంబానికి అండగా నిలుస్తూ, ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందేలా డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ నిరంతరం సమన్వయం చేస్తున్నారు.












