కుబీర్ మండలంలోని హంపోలి (బి) గ్రామంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రూ.39.50 లక్షల నిధులతో చేపట్టనున్న చెరువు మరమ్మత్తుల పనులకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ పనులు పూర్తయితే సాగునీటి సమస్యలు తీరడంతో పాటు పంటల ఉత్పత్తి పెరుగుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



