రాంటెక్ లో ముమ్మరంగా ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం
ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 29
ముధోల్ మండలం రామ్టెక్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొంతింటి కలను సహకారం చేయడంలో భాగంగా మంజూరు చేసిన ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతుంది. హౌసింగ్ ఏఈ సవేరామ్ లబ్ధిదారులు వేసిన మార్కోట్ ను పరిశీలించారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. బేస్మెంట్ పూర్తి అయిన లబ్ధిదారుల ఫోటోలను తీసుకొని పంపడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు భుజంగరావు పటేల్, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు