ప్రొద్దుటూరుకు చెందిన యువ నాయకురాలు మోరే వెంకట సాహిత్య, జాతీయ స్థాయి యువ పార్లమెంట్ 2026 కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఎంపిక కావడంతో స్థానికంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జరిగింది.
ఉపాధ్యాయుల మండలి, సంస్కృతి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఒంటెరు శ్రీనివాసులు నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమానికి మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మోరే లక్ష్మణరావు, డా. వరుణ్, జింక సుబ్రమణియం, అహ్మద్, మునీంద్ర తదితర ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ, ప్రొద్దుటూరు వంటి పట్టణం నుంచి 20 ఏళ్ల యువతి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ను ప్రతినిధ్యం వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య అవగాహన పెంపొందించడంలో సాహిత్య ఆదర్శంగా నిలుస్తోందని అభినందించారు.
సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన మోరే వెంకట సాహిత్య, ఈ గౌరవం తన ఒక్కరిది కాదని, తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరి ఆశీర్వాదమని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజున ఈ సన్మానం అందుకోవడం జీవితంలో మరచిపోలేని క్షణమని ఆమె అన్నారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతోనే యువ పార్లమెంట్లో పాల్గొంటున్నానని, దేశ స్థాయిలో తన రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు.












