బిజెపి నాయకులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి

బిజెపి నాయకులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి

బిజెపి జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి

M4 న్యూస్, నిర్మల్ జిల్లా (ప్రతినిధి) అక్టోబర్ 11

బిజెపి నాయకులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం రోజు బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. గత కొన్ని నెలలుగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన బాట పట్టారని, దీంతో నిర్మల్ పట్టణంలో చెత్తాచెదారం, మురికి కాలువలు ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయని అన్నారు. పట్టణవాసులు చెత్తాచెదారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే బిజెపి నాయకులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ కార్మికులకు మద్దతుగా నిలిచి పట్టణంలోని చెత్తాచెదారాన్ని బిజెపి నాయకులు ఎత్తిపోసి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పోసి నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారులు బిజెపి నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. బిజెపి నాయకులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనియెడల బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు

Leave a Comment