బిఎస్ఐ ముధోల్ మండల కార్యవర్గం ఎన్నిక

బిఎస్ఐ ముధోల్ మండల కార్యవర్గం ఎన్నిక

ఎమ్4 ప్రతినిధి ముధోల్ 

 

 

మండల కేంద్రమైన ముధోల్ లోని నాగార్జున నగర్ బుద్ధ విహారలో భారతీయ బౌద్ధ మహాసభ ముధోల్ మండల కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షులు రమేష్‌బాబు వాఘమారే సమక్షంలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గంగాధర్ సొన్కాంబ్లే, ప్రధాన కార్యదర్శిగా అశోక్ వాగ్మారే,
కోశాధికారిగా పరమేష్ దుమనే, సంస్కార విభాగము ఉపాధ్యక్షుడుగా ప్రకాష్ టోకరే,
సంరక్షణ విభాగం ఉపాధ్యక్షులు విశ్వంబర్ జోంద్లే, ఆర్గనైజర్లుగా శంకర్ వాఘ్మరే, దత్తారం దేవ్కే,
శ్రవణ్ సోన్కంబ్లే, లక్ష్మణ్ దాస,
రాజారామ్ జుల్ఫేకర్, శెంబు భోజన్నను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ నిర్మల్ జిల్లా శాఖల నిర్వాహకులు సంజీవ్ సుస్లేకర్, గంగాధర్ శృంగారే, సంజీవ్ గాదేవార్, నాగోరావు జోంద్లే, అశోక్, కొంతం రాజేశ్వర్, అమృత్ తర్టే, భోజరామ్ వాఘ్మారే, గౌతమ్ సోంకాంబ్లే, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment