*కార్మిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం!*
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి*
హైదరాబాద్:అక్టోబర్ 26
హైదరాబాద్ బాలానగర్ లోని టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల గుర్తింపు యూనియన్ శనివారం నిర్వహించిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ , బీజేపీ ఎంపీ రఘునందన్ రావుని ఓడించి, భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్,మాట్లాడుతూ..ఎమ్ టీ ఏ ఆర్, కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి 359 మంది కార్మికులను పర్మనెంట్ చేసి, కార్మికులకు క్యాంటీన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కార్మికులకు బేసిక్ను 30% నుంచి 50% కు పెంచడం జరిగిందని, అదేవిధంగా ఇప్పుడు తనపై నమ్మకం పెట్టుకొని గెలిపించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కంపెనీలో కార్మికులకు ఉన్న ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎమ్ టి ఏ ఆర్ యూనియన్ జనరల్ సెక్రటరీ మాయ రాజయ్య, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ సత్యప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ లు వెంకటేశ్వర రెడ్డి, సమ్మయ్య, రాయుడు యాదవ్ తదితరులు ఉన్నారు.