భూభారతి పైలట్ కుంటాల మండలం ఎంపిక
జలత న్యూస్ కుంటాల మే 3 కుంటాల: నిర్మల్ జిల్లా కుంటాల మండలం భూభారతి పైలట్ మండలంలో ఎంపిక అయిందని తాసిల్దార్ కమల్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ 5 నుండి 12 మే వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ముగ్గురు తాసిల్దార్ లు టీం లీడర్లుగా ఏర్పడి షెడ్యూల్ ప్రకారం నిర్వహించే రెవెన్యూ సదస్సు లో ప్రజలకు ఏమైనా భూ సమస్యలు పట్టా పాస్ బుక్ సమస్యలు ఉంటే అక్కడక్కడనే అధికారులు అర్జీలు స్వీకరిస్తారు. కావున ఈ అవకాశాన్ని గ్రామ రైతు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ తెలిపారు.