శ్రీ అయ్యప్ప ఆలయంలో భవాని మాలాధారణ

శ్రీ అయ్యప్ప ఆలయంలో భవాని మాలాధారణ

శ్రీ అయ్యప్ప ఆలయంలో భవాని మాలాధారణ

మనోరంజని ప్రతినిధి, నిర్మల్ సెప్టెంబర్ 22

నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా సోమవారం భక్తులు భవాని మాలాధారణ స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారణ చేసిన భక్తులకు దీక్షా నియమాలను వివరించారు.

మాలధారణకు ముందు భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయ ప్రాంగణంలో భక్తి భావంతో కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment