బీసీ బంద్ విజయవంతం చేయాలి – మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్

బీసీ బంద్ విజయవంతం చేయాలి – మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్

బీసీ బంద్ విజయవంతం చేయాలి – మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్

 

  • బీసీ లకు 42% రిజర్వేషన్ పై హైకోర్టు స్టే

  • అన్ని రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతు

  • ప్రజలు, వ్యాపారులు, విద్యాసంస్థలు సహకరించాలని విజ్ఞప్తి



ముధోల్ మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్ బీసీ బంద్ విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హైకోర్ట్ 42% బీసీ రిజర్వేషన్లపై విధించిన స్టేకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుందని, ప్రజలు, వ్యాపారులు, పాఠశాల, కళాశాలలు సహకరించాలని ఆయన కోరారు. పోలీసులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.



బీసీ లకు 42% రిజర్వేషన్ పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు బంద్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముధోల్ మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్ మాట్లాడుతూ, ఈ బంద్‌ను జయప్రదం చేయడం ప్రతి బీసీ సోదరుని బాధ్యత అని పేర్కొన్నారు. బంద్ విజయవంతం కావడానికి ప్రజలు, వ్యాపారవేత్తలు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. బీసీ హక్కుల సాధన కోసం ఈ బంద్ చారిత్రాత్మకమని ఆయన అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment