ఉట్నూర్లో అమరవీరుడు ఆర్. శంకర్ జ్ఞాపకార్థం బ్యారక్ ప్రారంభం
మనోరంజనీ, అక్టోబర్ 14, 2025 (M4News):
అక్టోబర్ 21 ఫ్లాగ్ డే వారోత్సవాల సందర్భంగా, ఉట్నూర్లో అమరవీరుడు ఆర్. శంకర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన బ్యారక్ను ప్రారంభించడం జరిగింది. ఆర్. శంకర్ 1999లో బోథ్ ప్రాంతంలో సంఘవిద్రోహశక్తులతో పోరాడి అసువులు బాసిన ఘనత కలిగిన అమరవీరుడు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ మరియు ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఐపీఎస్ పూజా కార్యక్రమాలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి బ్యారక్ ప్రారంభించారు.
ఉట్నూర్ సబ్ డివిజనల్ సమీక్ష
-
సబ్ డివిజనల్ అధికారులతో సమావేశం నిర్వహించి మండలాలలో ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరచడం మరియు యువత, ప్రజలు, ఆదివాసీలకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించడం.
-
గుడుంబా, మాదక ద్రవ్యాలు, పేకాట, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై పటిష్టమైన నియంత్రణ.
-
జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిర్యాదుల, పెండింగ్ కేసుల, దర్యాప్తు పూర్తయిన కేసుల సమీక్ష.
-
ప్రభుత్వ రాయితీ బియ్యం సరైన వ్యక్తులకు మాత్రమే వెళ్తున్నదని పర్యవేక్షణ.
-
రాత్రి సమయాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు, వాహన ప్రమాదాల నివారణ, ఓపెన్ డ్రింకింగ్ నివారణకు డయల్ 100 ద్వారా గస్తీ నిర్వహణ.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్, నార్నూర్ సీఐ పి. ప్రభాకర్, ఆర్. శంకర్ భార్య ఆర్. దూరి భాయ్, కుమార్తె నిర్మల, ఎస్సైలు సాయన్న, ప్రవీణ్, అఖిల్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.