కస్తూర్బాలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

Alt Name: ముధోల్ కస్తూర్బా పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన
  • ముధోల్ కస్తూర్బా పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం
  • విద్యార్థినులకు మనీ మేనేజ్మెంట్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు
  • బ్యాంక్ లాభాలు, సేవలు, అకౌంట్ వివరాలపై చర్చ

Alt Name: ముధోల్ కస్తూర్బా పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన

నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. బ్యాంకు లాభాలు, సేవలు, అకౌంట్ నిర్వహణ, సైబర్ నేరాలపై ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థి దశ నుండే ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

 

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సోమవారం సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో బాలశక్తి కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఫర్హాత్ బేగం ఆధ్వర్యంలో, సిఎఫ్ఎల్ సభ్యులు రాపతి వినయ్ కుమార్, డి. మల్లేష్ పాల్గొని, విద్యార్థినులకు మనీ మేనేజ్మెంట్, ఆర్థిక లాభాలు, బ్యాంకు సేవలు, అకౌంట్ నిర్వహణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు విద్యా దశ నుండే ఆర్థిక విషయాలపై అవగాహన కలిగి ఉండడం వల్ల భవిష్యత్తులో లాభాలను పొందగలరని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment