న్యూఢిల్లీ, ఆగస్టు 20: న్యూఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి
జరగడం కలకలం రేపింది. ఆమెపై ఒక దుండగుడు దాడికి యత్నించాడు. ఫిర్యాదుదారుడిలా వచ్చి సీఎంపై ఏకంగా దాడి చేశాడు. జన్ సున్వాయ్ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దుండగుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అహ్మద్ బాషాగా పోలీసులు గుర్తించారు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.