- బీజేపీ బైంసా టౌన్ ఇంచార్జీగా కపిల్ సిందే నియామకం.
- సహా ఇంచార్జీగా దిలీప్ బండారి నియమించు.
- జిల్లా ఇంచార్జ్ పడిపెళ్లి గంగాధర్ ప్రకటన విడుదల.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్యెల్సి ఎన్నికల సంబంధించి, బీజేపీ బైంసా టౌన్ ఇంచార్జీగా కపిల్ సిందే మరియు సహా ఇంచార్జీగా దిలీప్ బండారి నియమితులయ్యారు. ఈ నిర్ణయంపై పటేల్, అంజు కుమార్ రెడ్డి మరియు జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రాడ్యుయేట్స్ రిజిస్ట్రేషన్, ఓటింగ్లో పాల్గొనాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్యెల్సి ఎన్నికల సంబంధించి, బీజేపీ బైంసా టౌన్ ఇంచార్జీగా కపిల్ సిందే మరియు సహా ఇంచార్జీగా దిలీప్ బండారి నియమితులయ్యారు. జిల్లా ఎమ్యెల్సి ఎన్నికల ఇంచార్జీ పడిపెళ్లి గంగాధర్ ఈ ప్రకటనను విడుదల చేశారు.
ఈ సందర్భంగా, కపిల్ సిందే మరియు దిలీప్ బండారి తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు జిల్లా ఇంచార్జ్ పడిపెళ్లి గంగాధర్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావు, జిల్లా అధ్యక్షులు కునింటి అంజు కుమార్ రెడ్డి, మరియు బీజేపీ జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అసెంబ్లీలో అత్యధిక గ్రాడ్యుయేట్స్ నమోదు కావాలని, అలాగే ఎన్నికల్లో పాల్గొనటానికి కృషి చేస్తామని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు ఇంచార్జ్లను అభినందించారు.