ప్రతినిధి: బ్రేకింగ్ న్యూస్, విజయవాడ
తేదీ: 18.10.2024
- ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం.
- మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్.
- “టిక్కెట్ కొని ఉచిత ప్రయాణం ఎక్కడ?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన షర్మిలా.
విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆమె ఈ ప్రయాణాన్ని సాధారణ ప్రయాణికురాలిగా చేసి, టిక్కెట్ కొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితిపై ప్రశ్నించారు.
షర్మిలా మాట్లాడుతూ, మహిళల హక్కుల కోసం ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించాలని ఆమె స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.