పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. నరేందర్ రెడ్డి విస్తృత ప్రచారం
- లక్షెట్టిపెట్లో పట్టభద్రుల ఎన్నికలకు అభ్యర్థి గా డా. నరేందర్ రెడ్డి ప్రచారం
- స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు
- ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి
లక్షెట్టిపేట్ రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి డా. నరేందర్ రెడ్డి, తనను గెలిపిస్తే ఉద్యోగ భర్తీకి కృషి చేస్తానని ప్రకటించారు. వివిధ విద్యాసంస్థలతో సమావేశమయ్యి, నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తానని చెప్పారు. మోడల్ స్కూల్ టీచర్స్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి నరేందర్ రెడ్డి, లక్షెట్టిపెట్ రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు కోరుతూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. సోమవారం, పట్టణంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఉద్యోగ నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడానికి స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని పేర్కొంటూ, గతంలో ఎమ్మెల్సీ పదవిని రాజకీయాల కోసమే వాడిన వారిని విమర్శించారు.
తాను ఎమ్మెల్సీగా గెలిస్తే, ప్రతి ఏడాది ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేలా కృషి చేస్తానని, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అందుబాటులో ఉంచుతానని తెలిపారు. ప్రత్యేకంగా, పోటీ పరీక్షలకు సిద్ధపడే అభ్యర్థులకు అందుబాటులో ఉండే స్టడీ మెటీరియల్స్ అందించే యాప్ను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.