దైనందిన ప్రజాజీవన సమస్యల పరిష్కారానికి ఎఐ దోహదం!

దైనందిన ప్రజాజీవన సమస్యల పరిష్కారానికి ఎఐ దోహదం!
దైనందిన ప్రజాజీవన సమస్యల పరిష్కారానికి ఎఐ దోహదం!
 
2030నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై $19.9 ట్రిలియన్ల ప్రభావం
 
ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన పౌరసేవల కోసం ఎఐ వినియోగం
 
2028 నాటికి భారత ఎఐ రంగంలో 28లక్షల ఉద్యోగావకాశాలు
 
కృత్రిమమేధపై రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్
 
దైనందిన ప్రజాజీవన సమస్యల పరిష్కారానికి ఎఐ దోహదం!
 
దావోస్: నేటి అధునాతన సాంకేతిక యుగంలో సులభతరమైన పాలనా విధానాల అమలు కోసం ఎఐని వినియోగించేందుకు ప్రపంచదేశాలు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దైనందిన ప్రజాజీవితంలో ఎదురయ్యే సమస్యలపై ఎఐ ఆధారిత పరిష్కారాలను అన్వేషించేందుకు “కృత్రిమ మేధ సద్వినియోగంతో తెలివైన, స్థిరమైన భవిష్యత్ నిర్మాణం ( AI for Good – Shaping a Smarter, Sustainable Tomorrow)” అనే అంశంపై దావోస్ బెల్వడేర్ లో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశానికి సంధాన కర్తగా ఎన్ డిటివి గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విష్ణు సోం సంధానకర్తగా వ్యవహరించగా, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ రెవిన్యూ ప్రెసిడెంట్ మట్ రెన్నర్, బిల్ మిలిందా గేట్స్ డైరక్టర్, ప్రోగ్రామ్ అడ్వకసీ అర్చనా వ్యాస్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సీనియర్ రిసెర్చ్ అసోసియేట్ డేనియల్ సస్ కైండ్ పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ…. ఈ ఏడాది గ్లోబల్ ఎఐ మార్కెట్ $243 బిలియన్లకు చేరుకోనుంది, ఇది 2030 నాటికి ప్రతిఏటా 27.67 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా.  
 
ఎఐ రంగంలో భారీఎత్తున పెట్టుబడులు
 
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) నివేదిక ప్రకారం జనరేటివ్ ఎఐ ప్రస్తుతం ప్రపంచ GDPలో 7% ప్రాతినిధ్యం కలిగి ఉంది.  ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ అంచనా ప్రకారం 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కృత్రిమ మేధ 19.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రభావాన్ని చూపబోతోంది. వ్యాపార కార్యకలాపాలు, ఉత్పత్తులు, సేవలను మెరుగుపర్చడంలో ఎఐ వినియోగానికి భారీఎత్తున పెట్టుబడులు రానున్నాయి. జపాన్ లో ఎఐ వినియోగం ద్వారా  విపత్తుల సమయంలో ప్రతిస్పందన సమయాన్ని 50% తగ్గించే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడమేగాక, అంచనా ఖచ్చితత్వం 30శాతం మెరుగైంది. యుఎస్ లో AI ఆధారిత మెరుగైన వాతావరణ అంచనా వ్యవస్థతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎఐ అప్లికేషన్లను వినియోగిస్తున్నారు. దక్షిణ కొరియా, సౌదీ అరేబియా వంటి అనేక దేశాలు పట్టణ ప్రణాళిక, రవాణా, ఎనర్జీ రంగాల్లో ఎఐ వినియోగంతోపాటు ఎఐ ఆధారిత నగరాలను నిర్మిస్తున్నాయి. సింగపూర్ లో ట్రాఫిక్ రద్దీని అంచనా వేయడానికి, సులభతరమైన ట్రాఫిక్ పరిష్కారాల కోసం ఎఐ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీనిద్వారా పీక్ అవర్ ఆలస్యాన్ని 20శాతం తగ్గించడమేగాక డ్రైవింగ్ వేగం 15శాతం మెరుగుపడింది.
 
ఎఐ వినియోగంలో ఎపి ముందంజ
 
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం సుపరిపాలన, సామాజికాభివృద్ధికి ఎఐ, డీప్ టెక్ వంటి అధునాతన సాంకేతికత వినియోగంలో ముందంజలో ఉంది. ఎపి పాలనా వ్యవస్థలో ఎఐ వినియోగానికి మేం గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నాం. దీనిద్వారా సులభతరమైన పౌరసేవల డెలివరీతోపాటు పాలనా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గ్లోబల్ వైబ్రన్సీ ఇండెక్స్ లో 4వస్థానంలో ఉన్న భారతదేశ ఎఐ మార్కెట్ ఈ ఏడాది 27.86శాతం వృద్ధితో $8.3 బిలియన్లకు చేరుకోబోతోంది. భారత్ లో బలమైన పరిశోధన, అభివృద్ధి, లీడర్ షిప్ ద్వారా శక్తివంతమైన ఎఐ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటవుతోంది. భారత బడ్జెట్ లో ఎఐ మిషన్ కోసం రూ.10,354 కోట్లు కేటాయించడం ఎఐ లో  అగ్రగామిగా ఎదిగేందుకు భారతదేశ నిబద్ధతను సూచిస్తోంది.సర్వీస్‌ నౌ, పియర్సన్ సంయుక్త అధ్యయనం ప్రకారం 2028 నాటికి భారతదేశంలో ఎఐ 2.73 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా వేసింది.ఇటీవల భారత ప్రభుత్వం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రముఖ సంస్థల నేతృత్వంలో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, స్థిరమైన నగరాల్లో మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoEలు) కేంద్రాలను ప్రకటించింది. 
 
ఎఐ పరిష్కారాల కోసం గూగుల్ తో ఒప్పందం
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎఐ సిటీని ఏర్పాటు చేయ్లాలని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. రిమోట్ సెన్సింగ్, ఎఐ సాంకేతికలను ఏకీకృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఉత్పాదకత కోసం కృషిచేస్తున్నాం. పబ్లిక్ హెల్త్ విభాగంలో ఎఐ వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ, సర్వీస్ డెలివరీ మెరుగుదలకు చర్యలు చేపడుతున్నాం. భవిష్యత్తులో డిజిటల్ మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఎఐ ఆధారిత సాంకేతికతల అమలుకు ఎపి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. హెల్త్ కేర్, సుస్థిరత వంటి కీలక రంగాల్లో ఎఐ వినియోగాన్ని వేగవంతం చేసేందుకు గత ఏడాది డిసెంబర్ లో ఎపి ప్రభుత్వం గూగుల్ తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.  AI పరిష్కారాలను అభివృద్ధి చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, స్థానిక స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందకు ఒప్పందం దోహదపడుతుంది.  ప్రభుత్వం, పరిశ్రమ, విద్యాసంస్థల భాగస్వామ్యంతో వాస్తవ-ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి AI వినియోగం విస్తృతమైన ప్రభావాన్ని చూపుతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment