వ్యవసాయ శాఖ మంత్రి కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ *

**వ్యవసాయ శాఖ మంత్రి కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ *
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి సోయా పంటను 10 నుంచి 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలి

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

భైంసా : అక్టోబర్ 07

ప్రభుత్వ సోయా కొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి ఆరు క్వింటాళ్లు మాత్రమే సోయా పంటను కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల సోయ కోనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వినతి పత్రాన్ని అందించారు. ముధోల్ నియోజకవర్గం లో రైతాంగం పెద్ద మొత్తంలో సోయా పంటను పండిస్తున్నారని, ప్రస్తుతం ఎకరానికి దిగుబడి 10 క్వింటాళ్ల వరకు వస్తుందని పరిమితిని పెంచాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.

Leave a Comment