ఎమ్4 న్యూస్
తానూర్, అక్టోబర్ 11
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని మసల్గా తాండా యాడి జగదాంబ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న యజ్ఞం, పూజలు శుక్రవారం 7వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మసల్గా గ్రామానికి చెందిన మైనారిటీ నాయుడు, మాజి ఉపసర్పంచ్ అహ్మద్ హుస్సేన్ మహరాజ్ శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తాండా నాయక్ శ్యామ్ రావు, జాదవ్, కారోబారి బాబు రావు, మాజి సర్పంచ్ పుండలిక్ జాదవ్, భీమ్ రావు పటేల్, మానిక్, దినేష్, గ్రామ పెద్దలు మరియు ఇతరులు పాల్గొన్నారు.