పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆత్మీయ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సారంగాపూర్ మండల కేంద్రంలోని కరుణాకర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం రోజు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు రవిరాజ్ ,శేషాద్రి,గణపతి రెడ్డి, గఫర్,సాయిరాం,గోవిందరావు వేదికపైకి ఆహ్వానించి, పాదాభివందనం చేసి పూలమాలతో, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం తమతో పాటు చదువుకొని మృతి చెందిన తమ మిత్రులకు ఘనంగా నివాళి అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment