ముధోల్, అక్టోబర్ 29
: నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన సరయు అనే విద్యార్థిని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. క్రీడా సమాఖ్య నిర్మల్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడ్యాల్లో 28న జరిగిన అండర్-17 బాలికల కబడ్డీ జోనల్ స్థాయి సెలక్షన్స్లో తన ప్రతిభను కనబరిచి, రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయింది.
- సరయు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక.
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడ్యాల్లో జోనల్ సెలక్షన్స్లో ఉత్తమ ప్రదర్శన.
- నవంబర్ 3 నుండి మహబూబ్ నగర్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది.