తడిసిన ధాన్యం తో రైతులకు తప్పని గోష

Paddy Farmers Struggling Due to Rain in Bhingal
  • వర్షాల కారణంగా పండించిన పంట తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారు
  • ధాన్యం కోతలు ఊపందుకున్నప్పటికీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి
  • ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో రైతుల ఆవేదన

 

భీంగల్‌లో ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం కోతలు పూర్తి చేసిన రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వడ్లను ఆరబెట్టడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో ధాన్యం తడిసి పోతుంది. వర్షాల మధ్య రైతులు కుప్పలు మార్చేందుకు హడావుడిగా శ్రమిస్తున్నారు. రైతులు తక్షణమే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని కోరుతున్నారు.

 

భీంగల్: అక్టోబర్ 22 –

జిల్లాలో వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కోతలు ఊపందుకున్నప్పటికీ, వడ్లను ఆరబెట్టడానికి వాతావరణం సహకరించకపోవడంతో రైతుల ఆందోళన పెరుగుతోంది. పలు గ్రామాల్లో ధాన్యం కోసి, వడ్లను కొనుగోలు కేంద్రాలు మరియు రోడ్లపై ఆరబెట్టారు. అయితే, వర్షాల కారణంగా ధాన్యం పూర్తిగా తడిసి రైతులు తమ కృషి వృథా అవుతుందన్న భయంతో ఉన్నారు.

ప్రస్తుతం, మహమ్మద్ నగర్ మండలంలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం పడటంతో ఇప్పటికే ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. 10 రోజులుగా ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభమైనా, తూకాలు ప్రారంభించకపోవడంతో రైతులు తమ ధాన్యం కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

రైతులు అధికారులు వెంటనే స్పందించి, ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment